ప్రధాని మోదీని తమ పెద్దన్నగా భావిస్తామని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి సంపూర్ణ సహకారం కోరుతున్నట్లు చెప్పారు. 5ట్రిలియన్ ఎకానమీని సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, మూసీ రివర్ డెవలప్మెంట్, మెట్రో రైల్ వంటి ప్రాజెక్టుల విషయంలో ప్రధాని సహకారం కోరుతున్నట్టు చెప్పారు. సెమీ కండక్టర్ యూనిట్లను ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళసై, ఎంపీ సోయంబాపు తదితరులు పాల్గొన్నారు.