2026 Rajya Sabha elections: రాజుకున్న రాజ్యసభ ఎన్నికల వేడి.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, కాంగ్రెస్.. బరిలో కీలక నేతలు! | | ACTPnews

2026 Rajya Sabha elections: రాజుకున్న రాజ్యసభ ఎన్నికల వేడి.. అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ, కాంగ్రెస్.. బరిలో కీలక నేతలు! |


బీజేపీ అభ్యర్థుల జాబితా: సంస్థాగత నేతలకు పెద్దపీట

భారతీయ జనతా పార్టీ అధిష్టానం గురువారం ఐదు రాష్ట్రాలకు సంబంధించిన కీలక అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈసారి కేబినెట్ మంత్రులను కాకుండా, పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్ ఆర్గనైజేషనల్ లీడర్లకు, కొత్త ముఖాలకు అవకాశం కల్పించింది.

మధ్యప్రదేశ్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, సీనియర్ నేత రజనీష్ అగర్వాల్ మధ్యప్రదేశ్ నుండి బరిలోకి దిగుతున్నారు.

రాజస్థాన్: రాజస్థాన్ కీలక నేత, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా (Satish Poonia)తో పాటు అల్కా గుర్జర్ పేరును అధిష్టానం ఖరారు చేసింది.

గుజరాత్: గుజరాత్‌లో ఖాళీగా ఉన్న స్థానాలకు రాజూభాయ్ శుక్లా, ముకేష్‌భాయ్ రాత్వా, మాన్‌సింగ్ పర్మార్, జితేంద్ర మేఘ్‌జీభాయ్ కంజారియా నలుగురు అభ్యర్థులను రంగంలోకి దించింది.

ఈశాన్య రాష్ట్రాలు: మణిపూర్ నుండి ఎ. శారదా దేవి, అరుణాచల్ ప్రదేశ్ నుండి తాయ్ తగాక్ అభ్యర్థులుగా ఎంపికయ్యారు.

ఉప ఎన్నిక కోటా (ఒడిశా): ఇటీవల బీజేడీ (BJD) వీడి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ దేబాశిష్ సమంతరాయ్ ఒడిశా ఉప ఎన్నిక అభ్యర్థిగా ఎంపికయ్యారు.

ట్విస్ట్: ఈ జాబితాలో ప్రస్తుతం కేంద్ర మంత్రులుగా ఉన్న రవ్‌నీత్ సింగ్ బిట్టు, జార్జ్ కురియన్లకు మళ్లీ అవకాశం దక్కకపోవడం గమనార్హం.

కాంగ్రెస్ అభ్యర్థులు

జూన్ 18న జరిగే రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఆరుగురిని అధిష్టానం ఫైనల్ చేసింది. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్‌ను ఎంపిక చేసింది. ఇక కర్ణాటక నుంచి అభ్యర్థులుగా ఏఐసీసీ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే, పవన్ ఖేరా, ఖాన్‌లను ఎంపిక చేసింది. ఇక జార్ఖండ్ నుంచి ప్రణవ్ ఝాలను ఎంపిక చేసింది. రాజస్తాన్ నుంచి డాంగీలను ఎంపిక చేసింది.

ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే..

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న 4 స్థానాలకు గానూ.. అసెంబ్లీలో ఉన్న తిరుగులేని మెజారిటీతో కూటమి (NDA) అన్ని స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశం ఉంది. ముందే కుదిరిన ఒప్పందం ప్రకారం తెలుగుదేశం పార్టీ 3 స్థానాల్లో, జనసేన 1 స్థానంలో తమ అభ్యర్థులను నిలపబోతున్నారు.

ఎన్నికల కీలక ఘట్టాలు

నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: జూన్ 8

పోలింగ్, ఫలితాల వెల్లడి: జూన్ 18 (ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, అనంతరం 5 గంటల నుండి లెక్కింపు)

ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో, జూన్ 8వ తేదీ నాటికి నామినేషన్ల పర్వం ముగిసి, జూన్ 18న తుది ఫలితాల ద్వారా రాజ్యసభలో సరికొత్త బలాబలాలు తేలనున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports