Last Updated:
Nepal: నేపాల్-చైనా సరిహద్దులోని గైరోంగ్ పోర్ట్ వద్ద పెను విధ్వంసం సృష్టించిన ప్రాణాంతక బురద వరద (మడ్స్లైడ్) వెనుక ఉన్న అసలు కారణం వెలుగులోకి వచ్చింది.
చైనాలోని జిజాంగ్ (టిబెట్) అటానమస్ రీజియన్ పరిధిలోని గైరోంగ్ కౌంటీలో పర్వత అందాలను చిత్రీకరిస్తున్న ఒక పర్యాటకుడి కెమెరాలో గ్లేషియర్ కూలిపోతున్న దృశ్యాలు ప్రమాదవశాత్తు రికార్డయ్యాయి. ఈ భయానక దృశ్యాలే సరిహద్దుల్లో ఘోర విపత్తుకు దారితీసినట్లు శాస్త్రవేత్తలు ప్రాథమికంగా నిర్ధారించారు. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైన్ హజార్డ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ డైరెక్టర్ కాంగ్ షిచాంగ్ మాట్లాడుతూ.. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ చిత్రాల్లో విపత్తు మూలంగా గుర్తించిన ప్రాంతం, వీడియోలో రికార్డైన ప్రాంతం ఒకటేనని స్పష్టం చేశారు. నేపాల్ భూభాగంలో హిమానీనదం (గ్లేషియర్) కుప్పకూలడం వల్ల ఏర్పడిన పరిణామాలే గైరోంగ్ పోర్ట్ను ముంచెత్తినట్లు గ్జిన్హువా వార్తా సంస్థ వెల్లడించింది.














