Last Updated:
సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన చిత్రం ‘మండాడి’. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.
ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ బ్యానర్ మీద సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన చిత్రం ‘మండాడి’. ఈ సినిమాని ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. ఈ మూవీలో మహిమా నంబియార్ హీరోయిన్గా నటించగా.. సత్యరాజ్, రవీంద్ర విజయ్, మిథున్, బాల శరవణన్ తదితరులు ఇతర కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని రేపు (సెప్టెంబర్ 10) భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఏపీ, తెలంగాణలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి భారీ ఎత్తున విడుదల చేయనుంది. ఇక ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పాటలు, టీజర్ అన్నీ కూడా సినిమా మీద హైప్ను పెంచేశాయి. రీసెంట్గా వచ్చిన ట్రైలర్ అయితే అందరినీలో సినిమాని చూడాలన్న ఇంట్రెస్ట్ను క్రియేట్ చేసింది.














