Last Updated:
తిరుమల శ్రీవారి హుండీకి బుధవారం ఒక్కరోజే రూ.6.93 కోట్ల నగదు కానుకలు సమర్పించారు. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన అత్యధిక హుండీ ఆదాయం రూ.7.15 కోట్ల రికార్డుకు తాజా ఆదాయం చేరువగా నిలిచింది.
తిరుమల శ్రీవారి హుండీ ఆదాయంలో మరోసారి భారీగా కానుకలు నమోదయ్యాయి. బుధవారం ఒక్కరోజే శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు హుండీలో ఏకంగా రూ.6.93 కోట్ల నగదు కానుకలను సమర్పించారు. దీంతో తిరుమలలో శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి కోట్ల రూపాయల స్థాయిలో నమోదైంది. ఈ వివరాలను టీటీడీ అధికారులు వెల్లడించారు.













