PM Modi: 9/11 దాడులకు 25 ఏళ్లు.. సరిహద్దు ఉగ్రవాదంపై మరోసారి గళమెత్తిన ప్రధాని మోదీ! | | ACTPnews

News18


Last Updated:

అగ్రరాజ్యం అమెరికాలో జరిగిన 9/11 భయంకర ఉగ్రదాడులకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బాధితులకు ఘనంగా నివాళులర్పించారు. సరిహద్దు ఉగ్రవాద నిర్మూలనపై ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

News18
News18

అగ్రరాజ్యం అమెరికాను వణికించిన 9/11 ఉగ్రదాడులు జరిగి నేటికి సరిగ్గా 25 ఏళ్లు పూర్తయ్యాయి. 2001 సెప్టెంబర్ 11న అల్-ఖైదా ఉగ్రవాదులు రెండు విమానాలను హైజాక్ చేసి న్యూయార్క్‌లోని ట్విన్ టవర్స్‌ను ఢీకొట్టిన ఘటనలో మూడు వేల మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడుల 25వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా మృతులకు ఘనంగా నివాళులర్పించారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఉగ్రవాదం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అమాయకులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ను పరోక్షంగా లక్ష్యంగా చేసుకుంటూ ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ఉగ్రవాదంతో తీవ్రంగా నష్టపోయిన బాధితురాలిగా, ఉగ్రవాద నిర్మూలన పోరులో భారతదేశం దశాబ్దాలుగా ఎప్పుడూ ముందు వరుసలోనే నిలబడుతోందని ఆయన మరోసారి తేల్చిచెప్పారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports