Last Updated:
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన మొదటి క్యాబినెట్ సమావేశంలో సీఎం డి.కె. శివకుమార్ ఈ ఉచిత బస్ పాస్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Free Bus pass For Students: కర్ణాటకలోని పాఠశాలలు, కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం నిర్వహించిన మొదటి క్యాబినెట్ సమావేశంలో సీఎం డి.కె. శివకుమార్ ఈ ఉచిత బస్ పాస్ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ ఈ ఉచిత బస్ పాస్ సదుపాయాన్ని విస్తరించాలని బుధవారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
“ఈ నిర్ణయానికి అనుగుణంగా, కర్ణాటకలోని నాలుగు ప్రభుత్వ రవాణా సంస్థల (ఆర్టీసీ) బస్సుల్లో ప్రయాణించే పాఠశాల, కాలేజీ విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని విస్తరించడానికి ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది” అని ప్రభుత్వ అధికారిక ప్రకటన పేర్కొంది.
రాష్ట్రంలోని కింది నాలుగు రవాణా సంస్థలకు చెందిన బస్సుల్లో విద్యార్థులు ఈ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఉపయోగించుకోవచ్చు:
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (KSRTC)
బెంగళూరు మెట్రోపాలిటన్ రవాణా సంస్థ (BMTC)
నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (NWKRTC)
కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (KKRTC)
ఈ పథకం అమలుకు సంబంధించిన పూర్తి వివరాలు, నిబంధనలు, వివరణాత్మక మార్గదర్శకాలను విడిగా త్వరలోనే జారీ చేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













