భారతీయ చలనచిత్ర రంగంలోనే ట్రెండ్సెట్టర్గా నిలిచిన సినిమా ‘దృశ్యం’. ఈ ఫ్రాంచైజీ నుండి రాబోతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘దృశ్యం 3’ (Drishyam 3). మలయాళ సూపర్ స్టార్ మోహన్లాల్ హీరోగా స్టార్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నేడు అనగా మే 21వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ మీనా, ఎస్తేర్ అనిల్, అన్సిబా హాసన్, సిద్దిఖీ, ఆషా శరత్, మురళీ గోపి, శ్రీకాంత్ మురళీ, ఆంటోని పెరంబవూర్, తదితరులు నటించారు. ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో నేడు ఈ మూవీ రిలీజ్ పట్ల అందరిలోనూ క్యూరియాసిటీ నెలకొంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతోంది, మేకర్స్ తో పాటు పబ్లిక్ ఏమంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం..













