తెలుగు టెలివిజన్ చరిత్రలో యాంకర్ సుమ తర్వాత ఒకే షోను సుదీర్ఘకాలం పాటు హోస్ట్ చేసిన అరుదైన ఘనత యాంకర్ రష్మీ గౌతమ్కే దక్కుతుంది. తనదైన క్యూట్ స్మైల్, గ్లామర్, చలాకీతనంతో ‘జబర్దస్త్’ (Jabardasth) కామెడీ షోను గత 13 ఏళ్లుగా విజయవంతంగా నడిపిస్తోంది. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’తో పాటుగా, ప్రస్తుతం ‘ఆహా’ ఓటీటీ (Aha OTT) కోసం మరో సరికొత్త షో కూడా చేస్తోంది రష్మీ. ఎన్నో ఏళ్లుగా బుల్లితెరను ఏలుతున్న రష్మీ గౌతమ్.. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తన వ్యక్తిగత, కుటుంబ నేపథ్యం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ఆ వివరాలు చూస్తే..














