Dengue vaccine: భారత్‌లో తొలి డెంగీ వ్యాక్సిన్ ‘క్యూడెంగా’కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ | | ACTPnews

Dengue vaccine: భారత్‌లో తొలి డెంగీ వ్యాక్సిన్ ‘క్యూడెంగా’కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ |


ఎవరు తీసుకోవచ్చు? ముందస్తు పరీక్షలు అవసరమా?

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదించిన మార్గదర్శకాల ప్రకారం, 4 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు ఉన్నవారు ఎవరైనా ఈ వ్యాక్సిన్ వేసుకోవడానికి అర్హులు. గతంలో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న కొన్ని వ్యాక్సిన్లకు ముందస్తు స్క్రీనింగ్ పరీక్ష అతిపెద్ద సమస్యగా ఉండేది. కానీ క్యూడెంగా వ్యాక్సిన్‌కు అటువంటి అవసరం లేదు. సదరు వ్యక్తి గతంలో డెంగీ బారిన పడ్డారా లేదా అన్న విషయంతో సంబంధం లేకుండా, ఎలాంటి ముందస్తు రక్త పరీక్షలూ లేకుండానే ఈ వ్యాక్సిన్‌ను సురక్షితంగా తీసుకోవచ్చని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది.

ఈ క్యూడెంగా వ్యాక్సిన్ ఒక లైవ్-అటెన్యుయేటెడ్ టెట్రావాలెంట్ టీకా. అంటే డెంగీకి కారణమయ్యే నాలుగు రకాల వైరస్ సీరోటైప్‌లైన DENV-1, DENV-2, DENV-3, DENV-4 నుంచి ఇది సమర్థంగా రక్షణ కల్పిస్తుంది. ఈ టీకాను మొత్తం 2 డోసులుగా ఇస్తారు. ప్రతి డోసులో 0.5 ఎంఎల్ (0.5 mL) మందును చర్మం కింద (సబ్‌క్యూటేనియస్ – Subcutaneous) ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు. మొదటి డోసు తీసుకున్న సరిగ్గా 3 నెలల తర్వాత రెండో డోసు తీసుకోవాల్సి ఉంటుంది.

భారత్‌లో డెంగీ తీవ్రత:

గత రెండు దశాబ్దాల్లో భారతదేశంలో నమోదైన డెంగ్యూ కేసుల సంఖ్య ఏకంగా 11 రెట్లు పెరిగిందని టకేడా సంస్థ తెలిపింది. నేచర్ అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న డెంగ్యూ కేసుల్లో దాదాపు 34 శాతం (మూడింట ఒక వంతు) కేవలం భారతదేశంలోనే ఉంటున్నాయి. హిందుస్థాన్ టైమ్స్ రిపోర్టు ప్రకారం, ఒక్క 2025 సంవత్సరంలోనే దేశవ్యాప్తంగా సుమారు 1,13,000 డెంగ్యూ కేసులు అధికారికంగా నమోదయ్యాయి. వాతావరణ మార్పులు, వేగవంతమైన పట్టణీకరణ, దోమలు వృద్ధి చెందడానికి అనుకూలమైన పరిస్థితుల కారణంగా డెంగీ ఏడాదంతా ఒక అతిపెద్ద ప్రజారోగ్య సమస్యగా మారింది.

ప్రపంచవ్యాప్తంగా డెంగీ ప్రభావిత ప్రాంతాలకు చెందిన సుమారు 28,000 మందిపై టకేడా సంస్థ ఫేజ్-1, ఫేజ్-2, ఫేజ్-3 కింద మొత్తం 19 క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. భారతదేశంలోనూ 4 నుంచి 60 ఏళ్ల వారిపై ఫేజ్-3 (DEN-302) క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా నిర్వహించింది. ఈ సుదీర్ఘ పరిశోధనల ఫలితంగా, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత డెంగీ కారణంగా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాన్ని ఈ టీకా 84.1 శాతం (4.5 సంవత్సరాల వ్యవధిలో) మేర తగ్గించినట్లు స్పష్టమైందని ది హిందూ పత్రిక రిపోర్ట్ చేసింది. రెండు డోసులు పూర్తయిన 12 నెలల తర్వాత, వ్యాధి సోకకుండా 80.2 శాతం సమర్థతను ఈ వ్యాక్సిన్ కనబరిచింది.

అంతర్జాతీయ ఆమోదం, WHO గుర్తింపు:

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన నాణ్యత, భద్రత, సమర్థత ప్రమాణాలకు అనుగుణంగా ఈ క్యూడెంగా వ్యాక్సిన్ ఉండటంతో దీనికి ‘డబ్ల్యూహెచ్‌ఓ ప్రీ-క్వాలిఫికేషన్’ కూడా లభించింది. ప్రపంచవ్యాప్తంగా డెంగీ వ్యాప్తి అధికంగా ఉన్న దేశాల్లో ఈ వ్యాక్సిన్‌ను ప్రభుత్వ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా అందించాలని WHO ఇప్పటికే సిఫార్సు చేసింది. ఈ క్రమంలో బ్రెజిల్, యూరోపియన్ యూనియన్, బ్రిటన్, ఇండోనేషియా, అర్జెంటీనా తదితర 43కి పైగా దేశాల్లో క్యూడెంగా ఇప్పటికే ఆమోదం పొంది, 32 మిలియన్లకు పైగా డోసులు ప్రపంచవ్యాప్తంగా పంపిణీ అయ్యాయి.

డెంగీ వ్యాధికి ప్రత్యేకమైన యాంటీ-వైరల్ (Anti-viral) చికిత్స ఏదీ లేదు. కేవలం లక్షణాల ఆధారంగానే డాక్టర్లు చికిత్స అందిస్తారు. ముఖ్యంగా ప్లేట్‌లెట్స్ సంఖ్య పడిపోవడం, డెంగీ హెమరేజిక్ ఫీవర్ లాంటి ప్రాణాంతక పరిస్థితులు తలెత్తడం తీవ్రమైన ముప్పు. ఇలాంటి సమయంలో ‘క్యూడెంగా’ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం భారతదేశ ప్రజారోగ్య వ్యవస్థపై భారాన్ని తగ్గించడానికి ఎంతో దోహదపడుతుంది. ఈ టీకాను యూనిసెఫ్ (UNICEF), పాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (PAHO) వంటి అంతర్జాతీయ సంస్థల ద్వారా కూడా కొనవచ్చు. అతి త్వరలో భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా ఈ టీకా అందుబాటులోకి రానుంది. ఈ వ్యాక్సిన్ ధర, ఫైనల్ పంపిణీ మార్గదర్శకాలపై కేంద్ర ప్రభుత్వం, సంస్థ ప్రతినిధులు త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఈ కొత్త టీకా రాకతో రాబోయే సంవత్సరాల్లో మరణాల రేటు, ఆసుపత్రుల పాలయ్యే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందని భారతీయ వైద్య రంగ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports