Iran vs USA: అమెరికా-ఇరాన్ మధ్య కీలక ఒప్పందం? హార్ముజ్ జలసంధి ఓపెన్‌కు మార్గం సుగమం! | | ACTPnews

News18


Last Updated:

అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నడుమ కీలక పరిణామం చోటుచేసుకుంది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరు దేశాల మధ్య మంగళ లేదా బుధవారాల్లో ఒక ముఖ్యమైన ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ వెల్లడించారు.

News18
News18

ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ గుండా వాణిజ్య నౌకల రాకపోకలు పునరుద్ధరించడానికి అమెరికా, ఇరాన్ మధ్య త్వరలోనే ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ తెలిపారు. సీఎన్‌బీసీ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక విషయాలు పంచుకున్నారు. ఇరాన్‌తో వాషింగ్టన్ చర్చలు జరుపుతోందని, మంగళ లేదా బుధవారం నాటికి ఒక సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

జలసంధిని వాడుకునే నౌకల నుంచి ఇరాన్ ఏదైనా టోల్ వసూలు చేస్తుందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ, పూర్తి స్వేచ్ఛాయుతమైన రాకపోకలకు ఈ ఒప్పందం అవకాశం కల్పిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ చర్చల మధ్యవర్తిత్వంలో కతార్, ఒమన్, పాకిస్తాన్ దేశాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఈ ఒప్పందం పూర్తయితే ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఇంధన, వాణిజ్య సమస్యలకు పెద్ద ఊరట లభిస్తుందని బెస్సెంట్ వివరించారు.

చమురు ధరల పతనం

అమెరికా ట్రెజరీ సెక్రటరీ చేసిన ఈ సానుకూల వ్యాఖ్యలతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. ముఖ్యంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 3 శాతానికి పైగా తగ్గి బ్యారెల్‌కు సుమారు 80 డాలర్ల వద్దకు చేరింది. పెర్షియన్ గల్ఫ్‌లో నిలిచిపోయిన వందలాది కమర్షియల్ నౌకలు తిరిగి ప్రయాణం ప్రారంభిస్తే ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. ఇది కేవలం చమురుకే పరిమితం కాదని, ఎరువులు, రిఫైన్డ్ ఉత్పత్తులు, పారిశ్రామిక గ్యాస్ సరఫరా కూడా మెరుగుపడుతుందని బెస్సెంట్ అభిప్రాయపడ్డారు.

సైనిక దాడులకు ట్రంప్ బ్రేక్

హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించే లక్ష్యంతో జరుగుతున్న ఈ చర్చలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై ప్లాన్ చేసిన భారీ సైనిక దాడిని ఆయన తాత్కాలికంగా విరమించుకున్నట్లు శనివారం ప్రకటించారు. గతంలో కూడా వివాదాలు ముగించడానికి పలు ఒప్పందాలు తెరపైకి వచ్చినా, మళ్లీ వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య దాడులు జరగడంతో అవి ముందుకు సాగలేదు. ఇప్పుడు ఎలాగైనా వాణిజ్య నౌకల రాకపోకలను పునరుద్ధరించాలనే ఉద్దేశ్యంతో ఇరు దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

గత ఒప్పందం విఫలం

హార్ముజ్ జలసంధిని తెరిచేందుకు జూన్ 17న అమెరికా, ఇరాన్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరినా, కొన్ని వారాలకే మళ్లీ దాడులు మొదలయ్యాయి. నౌకలు ఏ మార్గంలో ప్రయాణించాలనే దానిపై ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే దానికి కారణం. అమెరికా సైనిక రక్షణలో వెళుతున్న ట్యాంకర్లపై ఇరాన్ దాడులు చేయడం, దానికి దీటుగా అమెరికా వైమానిక దాడులు జరపడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. తాజా చర్చల ద్వారా ఈ విభేదాలను పరిష్కరించి, వాణిజ్య సముద్ర మార్గాన్ని మళ్లీ వాడుకలోకి తీసుకురావాలని భావిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *