Last Updated:
Bengaluru: మెట్రో నగరాల్లో జీవించడం కష్టంగా మారుతోంది. వచ్చే అరకొర జీతాల కోసం దూరా, భారాల నుండి ప్రయాసపడి ఉద్యోగాలు చేస్తున్న ప్రజలపై సుంకాల భారం మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ లాంటి అధిక జనాభా కలిగిన మెట్రోపాలిటన్ సిటీల్లో నివసించే వారికి భవిష్యత్తులో కొత్త ఫైన్లు భారంగా మారనున్నాయి.
Bengaluru: మెట్రో నగరాల్లో జీవించడం కష్టంగా మారుతోంది. వచ్చే అరకొర జీతాల కోసం దూరా, భారాల నుండి ప్రయాసపడి ఉద్యోగాలు చేస్తున్న ప్రజలపై సుంకాల భారం మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ లాంటి అధిక జనాభా కలిగిన మెట్రోపాలిటన్ సిటీల్లో నివసించే వారికి భవిష్యత్తులో కొత్త ఫైన్లు భారంగా మారనున్నాయి. దీనికి బెంగుళూరు మహానగరం ఓ చక్కని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం బెంగుళూరులో ఉన్న ఇంటి ముందు కాలనీల్లో వాహనాల పార్కింగ్ సౌకర్యం ఇకపై ఉండదని తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా కార్లు, ఇతర వాహనాలు పార్క్ చేస్తే భారీగానే ఫైన్ కట్టాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన తీర్మానం తీసుకుంది గ్రేటర్ బెంగుళూరు ప్రాధికార సంస్థ. అదే విధంగా అతి త్వరలోనే దీన్ని అమలు చేయడానికి కూడా ప్రణాళికలు రూపొందిస్తోంది.














