Last Updated:
నిఖిత ఎందుకు చనిపోయింది అనేది తేలాల్సి ఉంది. మనస్తాపంతోనే ఆమె మరణించిందని ప్రాథమికంగా తెలుస్తున్నా.. అందుకు కారణాలేంటి అనేది అసలు ప్రశ్న. ఆమె మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పోలీసులు దర్యాప్తు తర్వాతే ఏదైనా చెప్పగలం అంటున్నారు.
చెన్నై, కాంచీపురంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అక్కడి ఓ వర్శిటీలో.. ఈసీఈ థర్డ్ ఇయర్ చదువుతున్న నిఖిత.. హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతికి చెందిన నిఖిత.. 2 రోజులుగా హాస్టల్ గది నుంచి బయటకు రాలేదు. శుక్రవారం ఆమె గది నుంచి దుర్వాసన వస్తుండటంతో.. తోటి విద్యార్థులు అలర్ట్ అయ్యారు. పోలీసులకు కాల్ చేశారు. పోలీసులు వచ్చి.. తలుపులు పగలగొట్టి.. మృతదేహాన్ని.. పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.














