Bangladesh Hindus: బంగ్లాదేశ్‌లో దారుణం.. నలుగురు హిందువుల అనుమానాస్పద మృతి! | | ACTPnews

News18


Last Updated:

బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. రిటైర్డ్ ఉపాధ్యాయుడు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హిందూ సభ్యులు అనుమానాస్పద స్థితిలో శవాలై తేలారు. తాళం వేసిన ఇంట్లోకి పోలీసులు వెళ్లి చూడగా విగతజీవులుగా కనిపించారు.

News18
News18

బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్ నగరంలో అత్యంత విషాదకరమైన, దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తాళం వేసి ఉన్న ఒక ఇంట్లో రిటైర్డ్ ఉపాధ్యాయుడు సహా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు హిందువులు అనుమానాస్పద స్థితిలో శవాలై కనిపించారు. దాస్‌పారా ప్రాంతంలో కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో నివసిస్తున్న రిటైర్డ్ టీచర్ గణపతి చక్రవర్తి (65), భార్య ప్రీతిలత (50), కుమార్తె ఆగామి (23), కుమారుడు ప్రియం (12) విగతజీవులుగా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. గత గురువారం నుంచి కుటుంబ సభ్యుల ఫోన్లు అన్నీ స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చిన బంధువులు శనివారం రాత్రి ఇంటికి వెళ్లారు. మెయిన్ గేట్‌కు తాళం వేసి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా నలుగురూ శవాలై కనిపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports