Last Updated:
BRICS: బ్రిక్స్ లోని మిగతా దేశాలు కూడా ఇండియా బాటలో నడిచేందుకు వీలవుతుంది. ముఖ్యంగా స్థిరమైన అభవృద్ధి, ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు, పర్యావరణానికి కీడును తగ్గించడం వంటివి.. భారత ప్రాధాన్య అంశాలుగా ఉన్నాయి. ఇవి మిగతా దేశాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 20న కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రి భూపేందర్ యాదవ్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రజలతో పంచుకున్నారు. భారతదేశం బ్రిక్స్కి అధ్యక్షత వహిస్తూ.. ప్రజల సహకారంతో వాతావరణ చర్యలు చేపట్టి.. స్థిరమైన అభివృద్ధిని ఎలా సాధిస్తుందో ఈ వ్యాసం వివరిస్తోంది. ప్రధానమంత్రి కార్యాలయం X ప్లాట్ఫామ్లో ఈ విషయాన్ని పోస్ట్ చేసింది. సమగ్ర జీవనశైలులు, అడవుల పెంపకం, సర్క్యులర్ ఎకానమీ వంటి అంశాలపై ఈ వ్యాసంలో దృష్టి సారించారని తెలిపింది. ఇందులో భాగంగానే భారత్.. ఇప్పటికే కాలుష్య ఉద్గారాలను తగ్గిస్తోంది. అలాగే.. పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని పెంచుతోందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది.














