దేశ రాజధాని న్యూఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నీట్ (NEET) సహా వివిధ పోటీ పరీక్షల పత్రాల లీకేజీ, విద్యార్థుల ఆత్మహత్యలు మరియు నిరసనకారులపై పోలీసుల లాఠీఛార్జ్కు నిరసనగా కాంగ్రెస్ అధిపతి మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీలు, కార్యకర్తలు ప్రధాని నివాసం వైపు భారీ ప్రదర్శన చేపట్టారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులను అడ్డుకున్న ఢిల్లీ పోలీసులు పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ లైవ్ ఆందోళన దృశ్యాలు ఈ వీడియోలో చూడండి!













