Last Updated:
IND vs SL 2nd Test: కొలంబో వేదికగా భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆదివారం ప్రారంభమైన రెండో టెస్టు తొలి రోజే తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
శ్రీలంక పేస్ బౌలర్ అసిథ ఫెర్నాండోతో మైదానంలో వాగ్వాదానికి దిగి, దూకుడుగా ప్రవర్తించిన టీమ్ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ చిక్కుల్లో పడ్డాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన భారత ఇన్నింగ్స్లో 17వ ఓవర్ సందర్భంగా ఈ హైడ్రామా చోటుచేసుకుంది. అసిథ ఫెర్నాండో వేసిన ఆ ఓవర్లో యశస్వి జైస్వాల్ వరుసగా నాలుగు బంతుల్లో మూడు బౌండరీలు బాది మంచి జోరుమీద కనిపించాడు. అయితే అదే ఓవర్ చివరి బంతికి జైస్వాల్ బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకుని బంతి నేరుగా వికెట్లను తాకడంతో 45 పరుగుల వద్ద అతడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు.














