Iran USA War Updates: హార్ముజ్ జలసంధిపై రగడ.. అమెరికా ప్రతిపాదనలను తిరస్కరించిన ఇరాన్.. మూడు కీలక షరతులు! | | ACTPnews

News18


Last Updated:

హార్ముజ్ జలసంధిలో ప్రత్యామ్నాయ నౌకా మార్గాలను ఏర్పాటు చేయాలన్న అమెరికా ప్రతిపాదనను ఇరాన్ తీవ్రంగా వ్యతిరేకించింది. భవిష్యత్ చర్చల కోసం మూడు కఠినమైన షరతులను ముందుంచింది. జలసంధిపై తమ పూర్తి ఆధిపత్యాన్ని మొదట అంగీకరించాలని, స్తంభించిన నిధులు విడుదల చేశాకే అణు కార్యక్రమంపై మాట్లాడుతామని, తమ అనుమతి లేకుండా నౌకల ప్రయాణం కుదరదని ఇరాన్ తేల్చిచెప్పింది.

News18
News18

హార్ముజ్ జలసంధి గుండా ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఏర్పాటు చేసే అమెరికా ప్రతిపాదనను ఇరాన్ స్పష్టంగా తిరస్కరించింది. భవిష్యత్ చర్చల కోసం ఇరాన్ ప్రధానంగా మూడు కీలక షరతులు విధించింది. ముందుగా హార్ముజ్ జలసంధిపై తమ పూర్తి నియంత్రణను అంగీకరించాలని, ఆ తర్వాతే స్తంభించిన తమ నిధులను విడుదల చేయడంపై మాట్లాడాలని స్పష్టం చేసినట్లు న్యూస్18 ఇంగ్లీష్ కథనం పేర్కొంది. ఇక అణు కార్యక్రమం అంశాన్ని అందరికంటే చివర్లోనే చర్చలకు తీసుకోవాలని పట్టుబడుతోంది. ఈ మేరకు జెనీవా, దోహా లేదా ఇస్లామాబాద్‌లలో చర్చలు కొనసాగించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్‌కు ఇరాన్ వర్గాలు తెలిపాయి.

ఒమన్ మధ్యవర్తిత్వం

మరోవైపు హార్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను పునరుద్ధరించేందుకు ఇరాన్, ఒమన్ మధ్య జరుగుతున్న చర్చలు సానుకూలంగా ముందుకుసాగుతున్నాయి. ఒమన్ ప్రతినిధులు శనివారం టెహ్రాన్‌లో చర్చలు ముగించుకుని తిరిగెళ్లారు. ఇదే సమయంలో అమెరికా కూడా ఇరాన్‌పై జరుపుతున్న మిలిటరీ దాడులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఉద్రిక్తతలు తగ్గించేందుకు రెండు వైపుల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి మరికొంత సమయం పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఇరాన్ పూర్తి ఆధిపత్యం

హార్ముజ్ జలసంధిపై తమకు పూర్తి ఆధిపత్యం ఉందని ఇరాన్ ఇస్లామిక్ రివాల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) స్పష్టం చేసింది. తమ అనుమతి లేకుండా ఈ మార్గం గుండా ఒక పిట్ట కూడా ప్రయాణించలేదని ప్రకటించింది. ఇరాన్ కేటాయించిన భద్రతా మార్గాన్ని కాదని, వేరే ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లేందుకు ప్రయత్నించిన ఒక చమురు ట్యాంకర్ సముద్రంలో అమర్చిన గనిని (మైన్) ఢీకొని పేలిపోయింది. తమ హెచ్చరికలను బేఖాతరు చేసిన ఆరు నౌకలను కూడా ఇరాన్ బలగాలు దారిలో నిలిపివేశాయి.

అమెరికాపై తీవ్ర ఆరోపణలు

హార్ముజ్ జలసంధి ఒప్పంద నిబంధనలను అమెరికా ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తోందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి తీవ్రంగా ఆరోపించారు. యుద్ధం ముగిసిన ఈ సంక్రమణ సమయంలో నౌకల రవాణాను పర్యవేక్షించే అధికారం ఆర్టికల్ 5 ప్రకారం తమకే ఉందన్నారు. కానీ అమెరికా దళాలు ఇరాన్ నిర్ణయించిన సురక్షిత మార్గం నుంచి నౌకలను మళ్లించి, అమెరికా సొంతంగా తయారుచేసిన ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేలా ఒత్తిడి చేస్తున్నాయని మండిపడ్డారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed