Last Updated:
జోర్డాన్లోని తమ సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిందనే వార్తలను అమెరికా తీవ్రంగా ఖండించింది. అయితే తమపై దాడులకు యత్నించినందుకే ముందస్తుగా దాడి చేశామని ఇరాన్ సోషల్ మీడియాలో ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
జోర్డాన్ దేశంలోని ఒక అమెరికా సైనిక స్థావరంపై ఇరాన్ క్షిపణి దాడులు చేసిందనే వార్తలు పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. తమ దళాలు ముందస్తు దాడులు చేసినట్లు ఇరాన్ పరోక్షంగా అంగీకరించింది. ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ మేరకు ఒక సంచలన పోస్ట్ పెట్టారు. “దాడులను ఆపడానికి ఉత్తమ మార్గం ముందుగా దాడి చేయడమే. మమ్మల్ని దెబ్బతీయడానికి సిద్ధమవుతున్న జోర్డాన్లోని అమెరికా బేస్పై మా బలగాలు దాడి చేశాయి. మిడిల్ ఈస్ట్లో ముందస్తు దాడులకు కూడా ఇప్పుడు ముందస్తు దాడి అవసరం” అని ఆ పోస్ట్లో పేర్కొన్నారు.














