Last Updated:
లక్నోలో వర్షం ప్రభావిత మ్యాచ్లో ఆతిథ్య జట్టు 19 ఓవర్లలో 3 వికెట్లకు 209, మిచెల్ మార్ష్ 56 బంతుల్లో 111తో మెరుపు సెంచరీ, విరాట్ కోహ్లీ అతన్ని అభినందించాడు
లక్నో వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్లో ఆతిథ్య జట్టు భారీ స్కోర్ సాధించింది. మిచెల్ మార్ష్ అద్భుత సెంచరీతో చెలరేగిపోయాడు. 56 బంతుల్లో 111 (9 ఫోర్లు, 9 సిక్సులు) పరుగులు సాధించి జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించాడు. ఐతే వర్షం కారణంగా మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించగా.. లక్నో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 209 పరుగులు సాధించింది. ఓపెనర్ అర్షిన్ కుల్కర్నీ (17) విఫలమైనప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ (38), రిషబ్ పంత్ 32 (4 ఫోర్లు, 2 సిక్సులు) వేగంగా పరుగులు సాధించడంతో జట్టు స్కోర్ 209కు చేరుకుంది. ఇక ఆర్సీబీ బౌలర్లలో హేజల్వుడ్, క్రుణాల్ పాండ్యా, రసిక్ సలామ్ చెరో వికెట్ పడగొట్టారు.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana
May 07, 2026 10:33 PM IST













