Last Updated:
జాతీయ క్రీడా దినోత్సవానికి రెండు రోజుల ముందే ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న యువత, క్రీడాకారులతో ప్రత్యేకంగా సంభాషించనున్నారు. 1,500కు పైగా ప్రాంతాల్లో జరగనున్న ఈ కార్యక్రమంలో స్టార్ క్రీడాకారులు కూడా పాల్గొంటారు.
జాతీయ క్రీడా దినోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా క్రీడాకారులు, యువతతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ముచ్చటించనున్నారు. ఆగస్టు 27న దేశంలోని 1,500కు పైగా ప్రాంతాల్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే క్రీడాకారులు, యువతను ప్రధాని వర్చువల్గా ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ చేపడుతున్న ప్రధాన కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.














