రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు నీతా అంబానీ నాయకత్వంలో రిలయన్స్ ఫౌండేషన్ సమాజ సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తోంది. వినూత్నమైన, స్థిరమైన పరిష్కారాల ద్వారా దేశ అభివృద్ధికి ఈ సామాజిక సేవా విభాగం ఎంతో కృషి చేస్తోంది. విద్య, ఆరోగ్యం, విపత్తు నిర్వహణ లాంటి పలు రంగాలపై దృష్టి సారిస్తూ ఈ సంస్థ సేవలు అందిస్తోంది. ఇప్పటివరకు భారతదేశవ్యాప్తంగా 98,000 కంటే ఎక్కువ గ్రామాల్లో, వివిధ నగర ప్రాంతాల్లో సుమారు 10 కోట్ల మందికి పైగా ప్రజల జీవితాల్లో ఈ ఫౌండేషన్ వెలుగులు నింపింది.














