West Bengal Violence | టీఎంసీ ఆఫీసుకు నిప్పు | ACTPnews

West Bengal Violence | టీఎంసీ ఆఫీసుకు నిప్పు



పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ రాజకీయ హింస మరోసారి పతాక స్థాయికి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల తృణమూల్ కాంగ్రెస్ (TMC) కార్యాలయాలపై దాడులు జరిగాయి. జమురియాలోని రతీ బాతీ ఏరియాలో టీఎంసీ ఆఫీసును ధ్వంసం చేసి నిప్పు పెట్టగా, హౌరాలో పార్టీ పోస్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు చింపివేశారు. బరాసత్ మరియు అసన్సోల్ పరిధిలోని బరాబాని ప్రాంతాల్లో కూడా కార్యాలయాల ధ్వంసం ఘటనలు వెలుగుచూశాయి. ఈ దాడుల వెనుక బీజేపీ హస్తం ఉందని టీఎంసీ కార్యకర్తలు ఆరోపిస్తుండగా, పోలీసులు భారీగా మోహరించి విచారణ చేపట్టారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *