ఈ కార్యక్రమాన్ని ప్రకటించిన మీడియా సమావేశంలో సుధా రెడ్డి, సుధా రెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, MEIL డైరెక్టర్, మిస్ వరల్డ్ 2025 ఒపల్ సుచాతా చువాంగ్స్రీ, 10 ఏళ్ల అనుభవం ఉన్న బ్రెస్ట్ ఆంకోసర్జన్ డాక్టర్ ప్రజ్ఞా చిగురుపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధా రెడ్డి మాట్లాడుతూ, పింక్ పవర్ రన్ కేవలం ఒక స్పోర్ట్స్ ఈవెంట్గా కాకుండా ఫిట్నెస్, ముందస్తు ఆరోగ్య జాగ్రత్తలు, సమస్యను తొలిదశలోనే గుర్తించడం ఎంత ముఖ్యమో గుర్తుచేసే కార్యక్రమంగా ఉండాలని చెప్పారు. ‘హెల్త్ ఈజ్ వెల్త్’ అనే మాటను ప్రస్తావిస్తూ, ఆరోగ్యంగా ఉన్న సమాజమే బలమైన, చురుకైన ఆర్థిక వ్యవస్థకు పునాది అని అన్నారు. ప్రజల మొత్తం ఆరోగ్యంపై అవగాహన పెంచడం, రొమ్ము క్యాన్సర్ గురించి కీలకమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడమే ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని ఆమె చెప్పారు. మూడో ఎడిషన్కు చేరుకున్న ఈ రన్ ద్వారా సమాజంలోని మరింత మంది ప్రజలను ఒకచోట చేర్చి, ఆరోగ్యంపై అవగాహనను ప్రాణాలను కాపాడే చర్యలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.













