Last Updated:
ఈ ఆందోళనల్లో అసాంఘిక శక్తులు పాల్గొన్నాయని ఆరోపిస్తూ.. ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు. దాంతో సుప్రీంకోర్టు.. స్వతంత్ర దర్యాప్తుకి ఆదేశించింది.
ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలోని విద్యార్థి ఆందోళనలపై సుప్రీంకోర్టు స్వతంత్ర, న్యాయబద్ధమైన దర్యాప్తు జరిపేందుకు ఆదేశించింది. రిటైర్డ్ జడ్ద్, డీజీపీ నేతృత్వంలో ఈ దర్యాప్తు జరగనుంది. ఈ ఆందోళనల్లో అసాంఘిక శక్తులు పాల్గొన్నాయని ఆరోపిస్తూ.. ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చారు. దాంతో సుప్రీంకోర్టు.. స్వతంత్ర దర్యాప్తుకి ఆదేశించింది. మరోవైపు ఈ ఆందోళనలను నడిపించిన అభిజిత్ దీప్కేపై.. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రత్యేక ఆరోపణలు చేశారు. దీప్కే.. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ మనిషి అని ఆరోపించారు. కేజ్రీవాల్తో కలిసి ఇదంతా చేశారని అన్నారు.














