Last Updated:
భారత వాయుసేన చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో రష్యా తయారీ ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను గుర్తించేందుకు పాకిస్థాన్ భారత్లోని స్లీపర్ సెల్స్, గూఢచారులను రంగంలోకి దించినట్లు రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా వెల్లడించారు.
గతేడాది భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్థాన్ తీవ్ర భయాందోళనకు గురైందని రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా తెలిపారు. ఆ సమయంలో భారత వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ కమాండర్గా పనిచేసిన ఆయన ఏఎన్ఐ (ANI) వార్తా సంస్థతో మాట్లాడుతూ పలు సంచలన విషయాలు వెల్లడించారు. భారత సరిహద్దుకు 200 కిలోమీటర్ల దూరం వరకు కూడా పాక్ యుద్ధ విమానాలు రాకుండా రష్యా తయారీ ఎస్-400 (S-400) క్షిపణి రక్షణ వ్యవస్థలు అడ్డుగోడలా నిలిచాయని పేర్కొన్నారు.














