Last Updated:
ఆక్టేవ్ ఇంటెలిజెన్స్ హైదరాబాద్లో టెక్నాలజీ, ఇన్నోవేషన్ సెంటర్ను ప్రారంభించింది. 2,000 మంది ఇంజినీర్లతో విస్తరణకు ప్రణాళికలు రూపొందించింది.
అమెరికా ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఇండస్ట్రియల్ టెక్నాలజీ కంపెనీ ఆక్టేవ్ ఇంటెలిజెన్స్ పీఎల్సీ హైదరాబాద్లో తన టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ను బుధవారం ప్రారంభించింది. రాబోయే సంవత్సరాల్లో ఈ కేంద్రాన్ని 2,000 మంది ఇంజినీర్ల స్థాయికి తీసుకెళ్లాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, ఏఐ, డేటా, క్లౌడ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ సహా అడ్వాన్స్డ్ టెక్నాలజీ విభాగాల్లో ఆక్టేవ్ ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న టెక్నాలజీ, ఇన్నోవేషన్ కార్యకలాపాలకు హైదరాబాద్ సెంటర్ కీలకంగా పనిచేయనుంది. హైదరాబాద్ హైటెక్ సిటీలో 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఇందులో ఆక్టేవ్ కనెక్టెడ్, కాంటెక్స్చువల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్, టెక్నాలజీ సామర్థ్యాలను చూపించే ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉంది. పలు అంతస్తుల్లో ఆఫీస్ స్పేస్లను కూడా ఏర్పాటు చేశారు.














