హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఇలా చేస్తే రూ.10 వేలు జరిమానా! | తెలంగాణ వార్తలు | ACTPnews

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఇలా చేస్తే రూ.10 వేలు జరిమానా!


Last Updated:

తాగునీటితో దుకాణాన్ని కడుగుతున్న వ్యక్తిని అడ్డంగా పట్టుకున్న వాటర్ బోర్డు అధికారి. ఏకంగా రూ.10 వేల జరిమానా విధించారు. నీటిని వృథా చేస్తే కఠిన చర్యలు తప్పవని నగర ప్రజలను హెచ్చరించారు.

హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఇలా చేస్తే రూ.10 వేలు జరిమానా!
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఇలా చేస్తే రూ.10 వేలు జరిమానా!

నీరు అమృతం.. దాన్ని వృథా చేస్తే భవిష్యత్తు అంధకారం. గుక్కెడు నీటి కోసం ఒకవైపు జనం అల్లాడుతుంటే.. మరోవైపు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. నీటి ప్రాముఖ్యతను గాలికి వదిలేసి, తాగునీటిని ఇష్టానుసారంగా రోడ్లు, దుకాణాలు కడిగేందుకు వాడుతున్న వారికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు (HMWSSB) గట్టి షాక్ ఇచ్చింది. నగరంలోని అత్యంత ఖరీదైన బంజారాహిల్స్ ప్రాంతంలో తాగునీటిని వృథా చేస్తున్న ఓ దుకాణదారుడికి ఏకంగా పదివేల రూపాయల జరిమానా విధించి అధికారుల పవర్ ఏంటో చూపించింది.

న్యూస్‌మీటర్ ప్రకారం.. ఈ ఆసక్తికరమైన ఘటన బుధవారం నాడు చోటుచేసుకుంది. వాటర్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) అశోక్ రెడ్డి బంజారాహిల్స్ ప్రధాన రహదారి గుండా తన వాహనంలో ప్రయాణిస్తున్నారు. సరిగ్గా రోడ్ నంబర్ 12 వద్దకు రాగానే ఆయన కంట ఒక దృశ్యం పడింది. అక్కడున్న ఆరెంజ్ ట్రీ ఫర్నిచర్ దుకాణానికి చెందిన ఓ వ్యక్తి, వాటర్ బోర్డు సరఫరా చేస్తున్న స్వచ్ఛమైన తాగునీటిని కిందపోస్తూ షాపు ప్రాంగణాన్ని కడుగుతూ కనిపించాడు. నీటిని అలా యథేచ్ఛగా నేలపాలు చేస్తుండటం చూసి ఎండీ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

ఇది కూడా చదవండి: మధ్యాహ్నం దాకా భారీ ట్రాఫిక్ ఆంక్షలు.. బక్రీద్ వేళ ఈ రూట్లలో వెళ్తే చిక్కుకుపోతారు జాగ్రత్త!

వెంటనే తన వాహనాన్ని ఆపి కిందకు దిగిన అశోక్ రెడ్డి.. తాగునీటిని ఇలా వృథా చేయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాగడానికి, ఇళ్లలోని అత్యవసర అవసరాలకు మాత్రమే ఉపయోగించాల్సిన నీటిని ఇలా రోడ్లు, దుకాణాలు కడగడానికి వాడటం ఏంటని ఆ వ్యక్తిని తీవ్రంగా మందలించారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన చర్యలను ఏమాత్రం ఉపేక్షించకూడదని భావించిన ఆయన, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను అక్కడికక్కడే ఆదేశించారు.

ఇది కూడా చదవండి: T-Wallet: టి-వాలెట్ వాడే వారికి బిగ్ షాక్.. వెంటనే ఈ విషయం తెలుసుకోండి!

ఎండీ ఆదేశాలతో అప్రమత్తమైన వాటర్ బోర్డు అధికారులు క్షణాల్లో రంగంలోకి దిగారు. తాగునీటిని వాణిజ్య అవసరాల కోసం, దుకాణాల శుభ్రత కోసం వినియోగించిన సదరు ఫర్నిచర్ షాపు యాజమాన్యానికి వెంటనే నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి నీటిని వృథా చేసినందుకు పెనాల్టీ కింద పదివేల రూపాయల భారీ జరిమానా విధించారు. ఈ ఆకస్మిక చర్యతో చుట్టుపక్కల దుకాణదారుల్లో సైతం ఒక్కసారిగా భయం మొదలైంది.

ఈ సందర్భంగా వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి నగర ప్రజలకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. నగరంలో నీటి డిమాండ్ ఎక్కువగా ఉన్నందున వాటర్ బోర్డు సరఫరా చేసే నీటిని ప్రతి చుక్కా పొదుపుగా వాడుకోవాలని సూచించారు. కమర్షియల్ అవసరాలకు, వాహనాలు కడిగేందుకు తాగునీటిని వాడితే సహించేది లేదని కఠినంగా హెచ్చరించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని, ఎవరైనా నీటిని వృథా చేస్తూ పట్టుబడితే ఏమాత్రం ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed