గత అనుభవమే ప్లస్
రామగుండం-రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, ధర్మపురి-అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రామగుండం, ధర్మపురి, కోరుట్ల-జువ్వాడి నర్సింగరావు, వేములవాడ-ఆదిశ్రీనివాస్, సిరిసిల్ల-కేకే మహేందర్ రెడ్డి, చొప్పదండి-మేడిపల్లి సత్యం, మానకొండూరు-కవ్వంపల్లి సత్యనారాయణలకు గతంలో పలు పార్టీలపై పోరాడిన అనభవంతో పాటు, ప్రజల్లో సానుభూతి, నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఉండడంతో పాటు పలు అంశాలు కలిసివచ్చే పరిస్థితులు కనబడడంతో, ఒక్కో నియోజకవర్గం నుంచి వచ్చిన అభ్యర్థుల జాబితాను వడపోసి మరీ ఈ అభ్యర్థులను ప్రకటించినట్టుగా తెలుస్తోంది. ఒక్క హుజురాబాద్ నియోజకవర్గం నుంచి మాత్రమే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్న వొడితెల రాజేశ్వర్ రావు మనవడైన వొడితెల ప్రణవ్ బాబు పేరు ప్రకటించారు. నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థుల్లో ఎవరిని విజయం వరిస్తుందో వేచిచూడాల్సిందే.