Last Updated:
తిరుపతి పోలీసులు జ్యువెలరీ, గోల్డ్ ప్లెడ్జ్ యజమానులతో సమావేశమయ్యారు. ఆస్తి నేరాల నివారణకు భద్రతా చర్యలు, సీసీటీవీలు, కేవైసీ అమలుపై సూచనలు చేశారు.
బంగారం ఆభరణాల దుకాణాలు, గోల్డ్ ప్లెడ్జ్ కేంద్రాల భద్రతపై తిరుపతి జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆస్తి నేరాలను అరికట్టడంతో పాటు దొంగిలించిన బంగారం చెలామణి కాకుండా ముందస్తు చర్యలు చేపడుతూ, జ్యువెలరీ షాపులు, పాన్ బ్రోకర్ దుకాణాల యజమానులతో కీలక సమావేశం నిర్వహించారు. వ్యాపారులు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ఈ సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు.














