Last Updated:
బీజేపీ తన కొత్త బృందాన్ని ప్రకటించింది. స్మృతి ఇరానీ ప్రధాన కార్యదర్శిగా నియమితులవ్వగా, వసుంధర రాజే, రామ్ మాధవ్, పురంధేశ్వరి వంటి వారికి ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. నితిన్ నవీన్ కొత్త బృందంలో 13 మంది జాతీయ ఉపాధ్యక్షులు ఉన్నారు.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తన కొత్త జాతీయ కార్యవర్గాన్ని సోమవారం ప్రకటించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ కొత్త టీమ్ను వెల్లడించారు. ఇందులో మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కీలకమైన జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు. 2024 లోక్సభ ఎన్నికల్లో అమేథీ స్థానం నుంచి ఓటమి తర్వాత సుమారు రెండేళ్లకు పైగా వ్యవధిలో ఆమె మళ్లీ పార్టీ జాతీయ సంస్థాగత వ్యవస్థలో కీలక పాత్రలోకి వచ్చారు.














