మామూలు దొంగ కాదు బాబోయ్.. దొంగిలించిన బంగారాన్ని ఎక్కడ దాచిందో తెలిస్తే అవాక్కవుతారు! | ట్రెండింగ్ | ACTPnews

News18


Last Updated:

ఈమె మామూలు లేడీ కాదు.. కీలేడి. బంగారం ఎంత సులభంగా దొంగలించిందో.. ఈ వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే.

News18
News18

బంగారం ధర కొండెక్కి కూర్చుంది. జనాలు కొనాలంటేనే జంకుతున్నారు. తులం కొనే చోట అరతులంతో సరిపెట్టుకుంటారు. ధరలు భారీగా పెరగడం ఇందుకు ప్రధాన కారణం. బంగారం విలువ చాలా పెరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక ఊహించని ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ రాష్ట్రం వడోదర నగరంలో పట్టపగలు ఓ ఆసక్తికరమైన చోరీ యత్నం వెలుగుచూసింది. నగరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే రేస్‌కోర్స్ సమీపంలో ఉన్న ఒక ప్రముఖ జ్యువెలరీ షోరూమ్‌కు ఓ మహిళ కస్టమర్ ముసుగులో వచ్చింది. సాధారణంగా మహిళలు బంగారం, వెండి ఆభరణాలు కొనుగోలు చేసే నెపంతో దుకాణాలకు వస్తుంటారు. ఈ మహిళ కూడా అచ్చం అలాగే లోపలికి ప్రవేశించి అత్యంత చాకచక్యంగా దొంగతనానికి పాల్పడేందుకు పథకం పన్నింది. అయితే ఆ దుకాణ సిబ్బంది ఎంతో అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆమె పన్నాగం ఏమాత్రం పారలేదు. క్షణాల్లోనే ఆమె బండారం బయటపడటంతో కటకటాల పాలై జైలు ఊచలు లెక్కపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.

న్యూస్18 గుజరాతీ ప్రకారం.. నగల దుకాణంలోకి అడుగుపెట్టిన ఆ మహిళ ముందుగా అక్కడున్న సిబ్బందిని తన మాటల్లో పెట్టింది. తనకు పెళ్లికి సంబంధించిన రకరకాల మోడల్స్ కావాలంటూ సేల్స్‌మెన్‌ను పూర్తిగా గందరగోళానికి గురిచేసింది. ఒకదాని తర్వాత ఒకటి ఆభరణాలు తీయమని అడుగుతూ వారి దృష్టి మళ్లించే ప్రయత్నం చేసింది. అదే సరైన అదనుగా భావించిన ఆమె కళ్లుగప్పి కౌంటర్ మీద ఉన్న ఓ అత్యంత విలువైన బంగారు ఉంగరాన్ని వేగంగా చేతిలోకి తీసుకుంది. ఆ తర్వాత ఎవరూ తనను చూడటం లేదని నిర్ధారించుకుని క్షణాల్లో ఆ ఉంగరాన్ని తన నోట్లో దాచిపెట్టుకుంది. ఏమీ ఎరుగని అమాయకురాలిలాగా నటిస్తూ అక్కడి నుంచి నెమ్మదిగా జారుకునేందుకు సిద్ధమైంది.

ఇది కూడా చదవండి: Shocking News: ప్రియుడితో పాడుపని.. కూతురికి కాదని తల్లి పీటలెక్కింది, మైండ్ బ్లాంక్ అయ్యే ట్విస్ట్!

అయితే ఆ షోరూమ్ సిబ్బంది కళ్లుగప్పడం ఆమెకు సాధ్యం కాలేదు. కౌంటర్లో ఉన్న ఆభరణాలను వెంటనే లెక్కచూసుకున్న సిబ్బందికి ఒక ఉంగరం తక్కువగా ఉన్నట్లు ఇట్టే అర్థమైంది. అనుమానంతో ఆ మహిళను గేటు వద్దే అడ్డుకుని నిలదీసి తనిఖీ చేయగా ఆమె నోట్లో దాచిన ఆ ఖరీదైన బంగారు ఉంగరం బయటపడింది. నోట్లో ఉంగరం పెట్టుకుని దొంగతనం చేస్తూ ఇలా రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో ఆ కిలాడీ మహిళ ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురైంది. తనను పోలీసులకు అప్పగించవద్దంటూ పదేపదే ప్రాధేయపడింది. అక్కడున్న సిబ్బంది కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకుంటూ నన్ను క్షమించండి అంటూ బతిమిలాడుకుంది.

సిబ్బంది ఆమె కన్నీళ్లకు ఏమాత్రం కరగకుండా ఆమెను గట్టిగా పట్టుకుని వెంటనే పోలీసులకు పూర్తి సమాచారం అందించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఆమె గురించిన విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మహిళ ఇలాంటి దొంగతనాలకు పాల్పడటం ఇదే తొలిసారి ఏమీ కాదు. గతంలో కూడా సరిగ్గా ఇదే తరహాలో పలు నగల దుకాణాలను లక్ష్యంగా చేసుకుని భారీగా చోరీలకు పాల్పడినట్లు స్పష్టంగా వెల్లడైంది. ఆమె పాత నేరాలకు సంబంధించిన పలు సీసీటీవీ ఫుటేజీలు కూడా పోలీసులకు స్పష్టంగా లభ్యమయ్యాయి. దీంతో ఆమె ఒక పక్కా ప్రొఫెషనల్ దొంగ అని, ఇది ఆమె వృత్తి అని నిర్ధారణ అయింది.

జ్యువెలరీ షోరూమ్ యాజమాన్యం ఇచ్చిన నిర్దిష్టమైన ఫిర్యాదు మేరకు అకోట పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితురాలిని వెంటనే అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆమె గతంలో ఏయే ప్రాంతాల్లో దొంగతనాలు చేసింది, ఈ నేరాల్లో ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు ముమ్మరం చేశారు. దొంగిలించిన సొమ్మును ఎవరికి అమ్ముతున్నారు అనే విషయాలను రాబడుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed