Last Updated:
Pakistan hospital fire: ఇస్లామాబాద్ పిఐఎంఎస్ ఆసుపత్రిలో ఈ అగ్ని ప్రమాదం సంభవించగా.. 15 మంది నవజాత శిశువులు సజీవ దహనం అయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రి పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిఐఎంఎస్)లో బుధవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గైనకాలజీ వార్డు నర్సరీలో చెలరేగిన మంటల్లో 15 మంది నవజాత శిశువులు ప్రాణాలు కోల్పోయారు. రాయిటర్స్ నివేదిక ప్రకారం, ఏసీ సిస్టమ్లో లోపం వల్ల మంటలు చెలరేగాయి.














