Last Updated:
నేపాల్లో భూకంప విషాదం మరువకముందే చైనాలో మరో భారీ ప్రకంపన కలకలం రేపింది. చైనాలో ఇప్పుడే ఒక భారీ భూకంపం సంభవించింది, భారతదేశంలో కూడా భూమి కంపించింది.
నేపాల్లో భూకంప విషాదం కొనసాగుతున్న వేళ.. పొరుగున ఉన్న చైనాలో శుక్రవారం భారీ భూకంపం సంభవించింది. చైనాలోని నైరుతి ప్రాంతమైన సిచువాన్ ప్రావిన్స్లోని లాంగ్చాంగ్ నగరంలో 5.1 తీవ్రతతో భూకంపం నమోదైంది. అదే సమయంలో భారత్లోని మణిపూర్లోనూ భూమి కంపించింది. అక్కడ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 3.6గా నమోదైంది. అయితే ఇప్పటివరకు రెండు ప్రాంతాల్లోనూ ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం వెలువడలేదు.














