Last Updated:
రక్షాబంధన్ వేళ ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, ఆప్యాయత, పరస్పర విశ్వాసంతో కూడిన బంధం ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉండాలని ఆకాంక్షించారు.
రక్షాబంధన్ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, పరస్పర విశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ బంధం ఎప్పటికీ చెక్కుచెదరకుండా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, సౌభాగ్యం, విజయాలు నిండాలని కోరుకున్నారు.














