Last Updated:
Nepal Floods: నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటంతో పెను విషాదం చోటుచేసుకుంది.
ఈ ప్రకృతి విపత్తులో మృతుల సంఖ్య 392కి చేరగా మరో 1,400 మందికి పైగా గల్లంతయ్యారు. తీవ్రమైన బురద, శిథిలాల మధ్య సహాయక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. గడ్డకట్టే చల్లని నీరు, బురద, రాళ్ల ప్రవాహానికి పలు గ్రామాలు పూర్తిగా కొట్టుకుపోగా.. ఇళ్లు, వంతెనలు, రహదారులు ధ్వంసమయ్యాయి. బాధితుల్లో నేపాల్లో ట్రెక్కింగ్ చేస్తున్న పర్యాటకులతో పాటు టిబెట్లోని పవిత్ర కైలాస పర్వత దర్శనానికి వెళ్లిన హిందూ యాత్రికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.














