Nepal Floods: నేపాల్‌లో అల్లకల్లోలం.. ఇప్పటికే 547 మంది మృతి.. మరో ముప్పు హెచ్చరిక! | | ACTPnews

News18


Last Updated:

నేపాల్, చైనా సరిహద్దుల్లో సంభవించిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు 547 మంది ప్రాణాలు కోల్పోయారు. భవిష్యత్తులో మరిన్ని వరదలు వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

News18
News18

నేపాల్ దేశాన్ని ఆకస్మిక వరదలు తీవ్ర స్థాయిలో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లోని నదులు భయంకరంగా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఎటు చూసినా గుండెలను పిండేసే కన్నీటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ప్రకృతి సృష్టించిన ఈ మహా విపత్తులో మృతుల సంఖ్య ప్రతిరోజూ అంతకంతకూ పెరుగుతోంది. అధికారిక వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ వరదల కారణంగా నేపాల్, చైనా సరిహద్దుల్లో ఇప్పటివరకు ఏకంగా 547 మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. లెండే నది సమీపంలో మంచుకొండలు, భారీ కొండచరియలు విరిగిపడటంతో భోటేకోషి, త్రిశూలి నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *