Last Updated:
వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలు మళ్లీ మొదలయ్యాయని, ఇరాన్ తన పట్టు కోల్పోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతర్జాతీయ జలాల్లో అమెరికా బలగాలు మైన్లను విజయవంతంగా తొలగించినట్లు స్పష్టం చేశారు.
ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకల రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ జలమార్గంపై ఇరాన్ సాధించిన ఆధిపత్యం పూర్తిగా దెబ్బతిన్నదని, ఆ దేశం తన పట్టును కోల్పోయిందని ఆయన స్పష్టం చేశారు. అమెరికా నౌకాదళం సముద్రంలో పాతిన ప్రమాదకర మైన్లను విజయవంతంగా తొలగించి, నౌకలకు గగనతల రక్షణతో పాటు ప్రత్యేక నిఘా పహారా కల్పిస్తోందని తెలిపారు.














