Last Updated:
ఆగస్టులో తిరుమల శ్రీవారిని 24.56 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.137.44 కోట్లు, 1.30 కోట్ల లడ్డూలు విక్రయించారు.
ఆగస్టు నెలలో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. నెల రోజుల వ్యవధిలో ఏకంగా 24,56,017 మంది భక్తులు శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శించుకోగా.. హుండీ కానుకల రూపంలో రూ.137.44 కోట్ల ఆదాయం సమకూరింది. దర్శనంతో పాటు లడ్డూ ప్రసాదానికి కూడా భారీ డిమాండ్ కనిపించింది. నెల మొత్తంలో 1.30 కోట్ల లడ్డూలను భక్తులు కొనుగోలు చేసినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.














