Last Updated:
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలో ఎంఎస్ ధోనీ భారీగా వాటాలు కొంటున్నాడన్న వార్తలను ఆ జట్టు యాజమాన్యం ఖండించింది. అయితే, ధోనీకి గతంలోనే సంస్థలో లక్షకు పైగా షేర్లు ఉన్నట్లు ఒక ప్రముఖ స్పోర్ట్స్ వెబ్సైట్ బయటపెట్టింది.
ఐపీఎల్ దిగ్గజ జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యాజమాన్యం టీమ్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి సంబంధించిన ఒక కీలకమైన వార్తపై క్లారిటీ ఇచ్చింది. సీఎస్కే ఫ్రాంచైజీలో 15 నుంచి 20 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ధోనీ ప్రయత్నిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. అయితే, నివేదికల ప్రకారం ధోనీకి ఇప్పటికే చెన్నై ఫ్రాంచైజీలో లక్షకు పైగా షేర్లు ఉన్నట్లు తెలిసింది. అన్లిస్టెడ్ కంపెనీ అయిన సీఎస్కే షేర్లను గతంలోనే ధోనీ ప్రైవేట్ మార్గంలో కొనుగోలు చేశాడు.














