Last Updated:
Madras Regiment weapons robbery: సికింద్రాబాద్లోని బొల్లారం కంటోన్మెంట్ పరిధిలో ఉన్న మద్రాస్ రెజిమెంట్ 20వ బెటాలియన్లో సంచలనం సృష్టించిన ఆయుధాల చోరీ కేసును హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు విజయవంతంగా ఛేదించారు.
సైన్యం నుంచి గతంలో తొలగింపునకు గురైన మాజీ హవిల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్ అలియాస్ రాజును ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. అత్యంత సున్నితమైన, రక్షణ విభాగానికి సంబంధించిన కేసు కావడంతో నగర పోలీసు యంత్రాంగం అత్యంత వేగంగా, పకడ్బందీ వ్యూహంతో వ్యవహరించి నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టింది.














