Nindu Noorella Saavasam: ‘నిండు నూరేళ్ల సావాసం’ మే 29 ఎపిసోడ్లో, స్టోర్ రూంలో ఆరు (అరుంధతి) ఫోటో చూసి స్పృహతప్పిన అమర్కు గతం గుర్తుకు రాలేదని తెలిసి మనోహరి ఊపిరి పీల్చుకుంటుంది. కానీ, అమర్ ఆ ఫోటోను హాల్లో పెట్టి దండ వేయడమే కాకుండా, బుజ్జమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి తనను ‘డాడీ’ అని పిలవమనడంతో మనోహరి షాక్ అవుతుంది. దీనిపై మనోహరి రూంలో యాదమ్మ, చంభాలతో బాధపడుతుండగా… అక్కడికి వచ్చిన మిస్సమ్మ (భాగీ), రాథోడ్లు ఆమెకు గట్టిగా వార్నింగ్ ఇస్తారు. అమర్ గుండెల్లో అరుంధతి స్థానం అలాగే ఉందని, బుజ్జమ్మగా పుట్టింది అరుంధతి మేడమేనని చెప్తూ, త్వరలోనే తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడి మెడపట్టి బయటకు గెంటేయడం ఖాయమని హెచ్చరిస్తారు. వారు వెళ్ళిపోయాక, తన టైం బాగోలేదని టెన్షన్ పడుతున్న మనోహరి, చంభాతో కలిసి ఎలాగైనా మిస్సమ్మకు చెక్ పెట్టాలని కొత్త ప్లాన్ వేయడంతో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది.













