Last Updated: Mar 18, 2026, 22:18 IST
విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ వేదికగా జరిగిన ఇఫ్తార్ విందులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి విందు ఆరగించిన ఆయన, అందరికీ ఉర్దూలో ముందస్తుగా ‘రంజాన్ ముబారక్’ తెలిపారు. రంజాన్ మాసం సేవా భావం, సామరస్యానికి ప్రతీక అని, సమాజంలో శాంతి, సోదరభావం అత్యంత అవసరమని జగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం మత పెద్దలు, వైఎస్సార్సీపీ నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.












