ఫిఫా ప్రపంచ కప్లో ఆడాలనే భారతదేశ నిరీక్షణ ఈసారి కూడా కొనసాగుతోంది. అయితే, ప్రస్తుతం జరుగుతున్న 2026 ఎడిషన్లో భారత్కు ఒక ప్రత్యేకమైన కనెక్షన్ లభించింది. పంజాబ్, కేరళ, తమిళనాడు మూలాలున్న నలుగురు అద్భుతమైన ఫుట్బాల్ ఆటగాళ్లు వేర్వేరు దేశాల జాతీయ జట్లకు ప్రాతినిధ్యం వహిస్తూ ఫుట్బాల్ మహాసమరంలో అడుగుపెట్టారు. న్యూస్18 ఇంగ్లీష్ కథనం ప్రకారం.. న్యూజిలాండ్, ఖతార్, డీఆర్ కాంగో, ఆస్ట్రేలియా దేశాల తరఫున బరిలోకి దిగుతున్న ఆ నలుగురు ప్రవాస భారతీయుల వివరాలు ఇవే











