ఈ నిరంతర శ్రమ ఫలితంగానే నేడు మౌలిక వసతుల కల్పన నుండి డిజిటల్ విప్లవం వరకు ప్రతి రంగంలో భారతదేశం ప్రపంచ వేదికపై ఒక సరికొత్త గుర్తింపును సొంతం చేసుకుందని మోదీ వివరించారు. దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల విస్తరణ, రవాణా సదుపాయాల ఆధునికీకరణ గ్లోబల్ స్థాయిలో భారత్ ప్రతిష్టను పెంచాయి. ‘వికసిత్ భారత్’ అనే గొప్ప సంకల్పాన్ని నిజం చేయడానికి రాబోయే రోజుల్లో కూడా తమ ప్రభుత్వం ఇదే సేవా మార్గంలో పయనిస్తుందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా ఆయన 12 అంశాలను వివరిస్తూ ఫొటోను షేర్ చేశారు. అందులోని వివరాల ప్రకారం..
దేశంలో 81 కోట్లకు పైగా ప్రజలకు ప్రతి నెలా ఉచిత రేషన్ అందిస్తున్నారు. 4 కోట్లకు పైగా పీఎం ఆవాస్ ఇళ్లు, 10.5 కోట్లకు పైగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, 12 కోట్లకు పైగా మరుగుదొడ్ల నిర్మాణంతో సామాన్యుల జీవితం సులువైంది.
దాదాపు 2 కోట్ల మంది యువతకు స్కిల్ ట్రైనింగ్ (నైపుణ్య శిక్షణ) ఇచ్చారు. రూ. 40 లక్షల కోట్ల ముద్రా రుణాలు అందించడంతో పాటు దేశవ్యాప్తంగా లక్షకు పైగా స్టార్టప్స్ ఏర్పాటయ్యాయి. 10,000కు పైగా అటల్ టింకరింగ్ ల్యాబ్స్తో నవకల్పనలను ప్రోత్సహిస్తున్నారు.
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రూ. 4.3 లక్షల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి చేరాయి.
4 కోట్లకు పైగా రైతులకు రూ. 26 లక్షల కోట్ల పంట బీమా లభించింది. రూ. 26 లక్షల కోట్లకు పైగా పంట కొనుగోళ్లు కనీస మద్దతు ధర (MSP)పై జరిగాయి. 8 కోట్ల మంది రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చారు.
32 కోట్లకు పైగా మహిళలకు జన్-ధన్ ఖాతాలు తెరిచారు. సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్ (పర్మనెంట్ కమిషన్) కేటాయించారు. 3 కోట్లకు పైగా లఖ్పతీ దీదీలను తయారుచేయడంతో పాటు, 10 కోట్ల మంది గ్రామీణ మహిళలను 91 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాల (SHG) ద్వారా బలోపేతం చేశారు.
70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. 60 కోట్లకు పైగా ప్రజలకు ఆయుష్మాన్ భారత్ రక్షణ కల్పించారు. దేశవ్యాప్తంగా 19,000కు పైగా జన-ఔషధి కేంద్రాల ద్వారా 90 శాతం వరకు చౌకగా మందులు అందజేస్తున్నారు.
రూ. 12.75 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి పన్ను మినహాయింపు (టాక్స్ ఫ్రీ) ఇచ్చారు. ఉడాన్ (UDAN) యోజన కింద 1.6 కోట్లకు పైగా ప్రయాణికులు తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం చేశారు. ఎంబీబీఎస్ (MBBS) సీట్ల సంఖ్య 151 శాతం పెరిగి దాదాపు 1.3 లక్షలకు చేరింది.
26 నగరాలలో 1,100 కిలోమీటర్లకు పైగా మెట్రో నెట్వర్క్ విస్తరించింది. దేశవ్యాప్తంగా 164 వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అటల్ సేతు, సుదర్శన్ సేతు, చీనాబ్ రైల్ బ్రిడ్జ్, బోగీబీల్ బ్రిడ్జ్, పంబన్ సముద్ర వంతెన వంటి భారీ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఎయిర్పోర్టుల సంఖ్య 74 నుండి 164కు పెరిగింది.
రక్షణ రంగంలో రికార్డు స్థాయిలో దాదాపు రూ. 38,400 కోట్ల డిఫెన్స్ ఎక్స్పోర్ట్ (ఎగుమతులు) జరిగాయి. నక్సల్స్ ముక్త భారత్ కల సాకారమవుతోంది. ఉగ్రవాదంపై గట్టి దెబ్బ కొట్టారు. గులామీ మానసిక స్థితి నుండి విముక్తి కల్పిస్తూ రాజ్పథ్ పేరును ‘కర్తవ్య పథ్’గా మార్చారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ముద్రతో ప్రేరణ పొంది నౌకాదళానికి సరికొత్త పతాకాన్ని రూపొందించారు.
అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం పూర్తయింది. కాశీ విశ్వనాథ్ ధామ్, మహాకాల్ లోక్, కేదార్నాథ్ ధామ్ వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాల రూపురేఖలను మార్చి సరికొత్త వైభవాన్ని తీసుకువచ్చారు.












