Hyderabad: ఐటీ ఉద్యోగులకు సైబరాబాద్ పోలీసుల అలర్ట్.. మధ్యాహ్నం 3:30 గంటలకే ఆఫీసుల నుంచి వెళ్లాలని రిక్వెస్ట్ | తెలంగాణ వార్తలు | ACTPnews

ఫైల్ ఫోటో


Last Updated:

Hyderabad: హైదరాబాద్‌ పరిధిలోని ఐటీ కారిడార్‌తో కూడిన సైబరాబాద్ ప్రాంత ప్రజలకు, ఐటీ కంపెనీలకు సైబరాబాద్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కీలక సూచనలు చేసింది.

ఫైల్ ఫోటో
ఫైల్ ఫోటో

ఈ రోజు (జూన్ 22, 2026) సాయంత్రం గంటల్లో నగరంలో మధ్యస్థం నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. సైబరాబాద్ పరిధిలో పనిచేస్తున్న అన్ని ఐటీ కంపెనీలు, విద్యా సంస్థలు, ఇతర కార్యాలయాలు, సంస్థలకు ఈ క్రింది విధంగా ‘వెదర్ అలర్ట్ అండ్ ట్రాఫిక్ అడ్వైజరీ’ జారీ చేయబడింది.

ముఖ్యమైన సూచనలు

మధ్యాహ్నం 3:30 నుండి లాగ్ అవుట్‌లు: ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించేందుకు జూన్ 22న మధ్యాహ్నం 3:30 గంటల నుండి విడతల వారీగా ఉద్యోగులకు ముందస్తు లాగ్ అవుట్ సౌకర్యం కల్పించాలని కంపెనీలను పోలీసులు కోరారు.

భద్రత – అత్యవసర సేవలు: ప్రయాణాలకు సంబంధించిన రిస్క్‌లను తగ్గించడం, రహదారులపై వాహనాల ఒత్తిడిని నియంత్రించడం మరియు ప్రతికూల వాతావరణంలో అత్యవసర సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఉద్యోగుల భద్రత, ఉత్పాదకత, రోడ్లపై తీవ్రమైన ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడకుండా ఉండేందుకు కార్యాలయాల యాజమాన్యాలు, ప్రజలు ఈ విషయమై సహకరించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports