జోధ్పూర్లో విమానయాన బూస్ట్:
ఉదయం సుమారు 10:45 గంటలకు జోధ్పూర్లో ప్రధాని మోదీ జోధ్పూర్ ఎయిర్పోర్ట్లోని కొత్త టెర్మినల్ బిల్డింగ్ను ప్రారంభిస్తారు. రూ.480 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ టెర్మినల్ 23,000 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇది సంవత్సరానికి 20 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించగలదు. రాజస్థాన్ రాజకీయ వారసత్వానికి అనుగుణంగా ఆర్కిష్, ఝరోఖాలతో ఆధునిక డిజైన్ కలిపి నిర్మించారు. ఇందులో ఎనర్జీ సమర్థమైన సిస్టమ్స్, వాటర్ కన్జర్వేషన్, గ్రీన్ బిల్డింగ్ ప్రాక్టీసులు ఉన్నాయి. 5-స్టార్ GRIHA రేటింగ్ లక్ష్యంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ టూరిజం, వాణిజ్యం, ఉపాధి అవకాశాలను పెంచుతుందని అధికారులు చెబుతున్నారు.
అదే సమయంలో సవరించిన UDAN స్కీమ్ను లాంచ్ చేస్తారు మోదీ. రాబోయే 10 సంవత్సరాల్లో రూ.28,840 కోట్ల కేటాయింపుతో ఈ స్కీమ్ ప్రాంతీయ విమానయాన సంబంధాల్ని బలోపేతం చేస్తుంది. రూ.12,000 కోట్లతో 100 ఏరోడ్రోమ్ల అభివృద్ధి, 200 హెలిప్యాడ్లు, ఆపరేషన్స్ & మెయింటెనెన్స్ సపోర్ట్, VGF ఫండింగ్, స్వదేశీ విమానాలైన HAL Dhruv, Dornierలకు ప్రోత్సాహం వంటివి ఇందులో ఉన్నాయి. “ఉదే దేశ్ కా ఆమ్ నాగరిక్” దృష్టిని ముందుకు తీసుకెళుతుంది.
ప్రధాని మోదీ.. సుమారు 12:15 గంటలకు.. పచ్పద్రా లోని బాలోత్రాకు వెళ్లి, రూ.1.06 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆవిష్కరిస్తారు. ఇందులో భారతదేశపు మొదటి గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైనరీ-కమ్-పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను దేశానికి అంకితం చేస్తారు. HPCL, రాజస్థాన్ ప్రభుత్వం జాయింట్ వెంచర్గా రూ.79,450 కోట్లతో నిర్మించిన 9 MMTPA రిఫైనరీ ఇది. దీని పెట్రోకెమికల్ కెపాసిటీ 2.4 MMTPA ఉంది. దీని హై నెల్సన్ కాంప్లెక్సిటీ ఇండెక్స్ 17.0, 26 శాతానికి పైగా పెట్రోకెమికల్ యీల్డ్ ఉంది. ఇది ఎనర్జీ సెక్యూరిటీని బలపరుస్తుంది, దిగుమతులను తగ్గిస్తుంది, ఉపాధి కల్పిస్తుంది. పెట్రోకెమికల్ & ప్లాస్టిక్ పార్క్కు యాంకర్గా పనిచేస్తుంది.
రూ.13,000 కోట్లు పైగా అంచనా వ్యయంతో ఉన్న జైపూర్ మెట్రో ఫేజ్-2కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. 41 కి.మీ నార్త్-సౌత్ కారిడార్.. 36 స్టేషన్లతో ప్రహ్లాద్పుర నుంచి తోడీ మోడ్ వరకు ఉంటుంది. ఇది సితాపుర, VKI ఇండస్ట్రియల్ ఏరియాలు, ఎయిర్పోర్ట్, హాస్పిటల్స్ను కనెక్ట్ చేస్తుంది. ఫేజ్-1 ఇప్పటికే ఆపరేషనల్లో ఉంది.
58 కిలోమీటర్ల చూరు-సదుల్పూర్, 46 కిలోమీటర్ల చూరు-రతంగఢ్, రూ.900 కోట్ల రైల్ డబులింగ్ ప్రాజెక్టులు, రూ.740 కోట్ల NH-125A జోధ్పూర్ రింగ్ రోడ్ ఫోర్-లైనింగ్ ప్రాజెక్టులను మోదీ జాతికి అంకితం చేస్తారు. రూ.5,500 కోట్ల SJVN 1,000 MW బికానెర్ సోలార్ ప్రాజెక్ట్, NHPC 300 MW కార్నిసర్ సోలార్ ప్లాంట్, REZ పవర్ ట్రాన్స్మిషన్ లైన్లు (₹1,900 కోట్లు పైగా) కూడా ఉన్నాయి. సుమారు 54,000 యువకులకు అపాయింట్మెంట్ లెటర్లు అందజేస్తారు.
సాయంత్రం సుమారు 4:30 గంటలకు అహ్మదాబాద్ లోని సనంద్లో CG సెమీ అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ (OSAT) ఫెసిలిటీని ప్రారంభిస్తారు. ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద ఆమోదం పొందిన మొదటి నాలుగు ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. రూ.7,500 కోట్ల పైగా పెట్టుబడితో నిర్మితమైన ఈ ఫెసిలిటీ ఏటా 5 బిలియన్ సెమీకండక్టర్ చిప్స్ ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంటుంది. ఆటోమోటివ్, ఇండస్ట్రియల్, 5G, IoT, AI రంగాలకు సపోర్ట్ చేస్తుంది. ఇది దేశం సెమీకండక్టర్ వాల్యూ చైన్లో ముఖ్యమైన అడుగు.
ప్రధాని రాజస్థాన్, గుజరాత్ ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాలు ఆత్మనిర్భర్ భారత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, యువత ఉపాధికి ఊతం ఇస్తాయని అధికారిక వర్గాలు తెలిపాయి.












