Trump: డబ్బు పిచ్చిలో ట్రంప్ మరో పిచ్చి నిర్ణయం.. మార్కెట్లను శాసించే ఆ పోస్ట్‌లు త్వరగా కావాలంటే రూ. 96 లక్షలు చెల్లించాల్సిందే! | | ACTPnews

ట్రంప్


Last Updated:

Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ట్రూత్ సోషల్ (Truth Social) ప్లాట్‌ఫామ్‌లోని కీలకమైన ప్రముఖుల అకౌంట్ల పోస్టులను సాధారణ వినియోగదారుల కంటే ముందే తెలుసుకునేలా ‘ట్రంప్ మీడియా, టెక్నాలజీ గ్రూప్’ ఒక సరికొత్త పెయిడ్ డేటా సర్వీస్ ప్లాన్‌ను లాంచ్ చేసింది.

ట్రంప్
ట్రంప్

దీనికి ‘ట్రూత్ ఏపీఐ’ (Truth API) అని పేరు పెట్టారు. దీని ద్వారా అత్యంత ప్రభావవంతమైన 10 అకౌంట్ల నుండి వచ్చే సమాచారాన్ని, సాధారణ యాప్ నోటిఫికేషన్ల కంటే ఎంతో వేగంగా బ్యాంకులు, హెడ్జ్ ఫండ్స్, ట్రేడింగ్ సంస్థలకు చేరవేస్తారు. సెకన్ల ఆలస్యం కూడా భారీ ఆర్థిక నష్టాలకు దారితీసే అవకాశం ఉన్న కార్పొరేట్ క్లయింట్లను దృష్టిలో ఉంచుకుని ఈ సేవలను తీసుకొచ్చినట్లు రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా నిమిషాల వ్యవధిలో వచ్చే సమాచారం ఆధారంగా ట్రేడింగ్ చేసే అల్గారిథమిక్ ట్రేడింగ్ సంస్థలకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది. ఇప్పటివరకు చాలా సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ట్రూత్ సోషల్ డేటాను స్క్రాప్ చేయడం లేదా మాన్యువల్‌గా ట్రాక్ చేయడం చేసేవి. ఈ సరికొత్త డేటా లైసెన్సింగ్ సేవ కోసం ట్రంప్ మీడియా ఏడాదికి $60,000 నుండి $100,000 (సుమారు రూ. 57 లక్షల నుండి రూ. 96 లక్షల వరకు) వసూలు చేయనున్నట్లు సమాచారం.

ఆగస్టు 1 నుండి అందుబాటులోకి రానున్న ఈ సర్వీస్ ద్వారా 2022 నాటి పాత పోస్టుల ఆర్కైవ్స్ అలాగే 24 గంటల పర్యవేక్షణ లభిస్తుంది. ఇప్పటికే పలువురు పెద్ద క్లయింట్లు దీని కోసం సైన్ అప్ చేసినట్లు కంపెనీ ఇంటర్మీడియట్ సీఈఓ కెవిన్ మెక్‌గర్న్ తెలిపారు.

మార్కెట్‌ను శాసిస్తున్న ట్రంప్ పోస్టులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసే పోస్టులు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. గతంలో చైనా వాణిజ్య విధానాలు, టారిఫ్‌ల విధింపులపై ఆయన చేసిన పోస్టులే ఇందుకు నిదర్శనం. ఉదాహరణకు, ఏప్రిల్ 9, 2025న కొత్త టారిఫ్‌లను 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ చేసిన ఒకే ఒక్క పోస్టుతో వాల్ స్ట్రీట్ సూచీలు భారీగా లాభపడ్డాయి. ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో మార్కెట్‌ను కదిలించగల ఏకైక శక్తివంతమైన వాయిస్ ట్రంప్ మాత్రమేనని, అందుకే ఆయన పోస్టులు ఇతరులకంటే ముందే అందడం తమకు అత్యంత విలువైనదని ఒక ఫండ్ మేనేజర్ పేర్కొన్నారు.

వివాదాలు – విమర్శలు

అయితే, ఈ పెయిడ్ డేటా ఫీడ్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డబ్బున్న పెద్ద సంస్థలకు మాత్రమే వేగంగా డేటా అందించడం వల్ల చిన్న ట్రేడర్లు నష్టపోతారని, ఇది మార్కెట్‌లో అసమానతలను పెంచుతుందని విమర్శకులు వాదిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల వాల్ స్ట్రీట్ సంస్థలకు లాభాలు రావడమే కాకుండా, ట్రంప్ కుటుంబానికి కూడా భారీగా ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని సెనేటర్ రాన్ వైడన్ ఆరోపించారు.

కంపెనీలో మెజారిటీ వాటా కలిగిన ట్రస్ట్‌ను ట్రంప్ పిల్లలు పర్యవేక్షిస్తున్నప్పటికీ, వైట్ హౌస్ మాత్రం ఎలాంటి ప్రయోజనాల వైరుధ్యం (Conflict of Interest) లేదని స్పష్టం చేసింది. లీగల్ నిపుణుల ప్రకారం.. ఇలా డేటా యాక్సెస్ కోసం ఛార్జ్ చేయడం మార్కెట్లలో సాధారణమేనని, ఇది సెక్యూరిటీస్ చట్టాలను ఉల్లంఘించినట్లు కాదని అభిప్రాయపడుతున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports