IND vs SL: శ్రీలంకతో టెస్టు సిరీస్‌.. ఆ స్టార్ ఆల్ రౌండర్ దూరం.. ఎంట్రీ ఇవ్వనున్న కొత్త బౌలర్! | క్రీడా వార్తలు | ACTPnews

టీమిండియా


Last Updated:

IND vs SL: భారత యువ పేస్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి శ్రీలంకతో త్వరలో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

టీమిండియా
టీమిండియా

తొడ కండరాల గాయం నుంచి కోలుకుంటున్న 22 ఏళ్ల నితీశ్, ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE)లో పునరావాసం పొందుతున్నాడు. అక్కడ అతడు బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించినప్పటికీ, ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే శ్రీలంక సిరీస్‌ సమయానికి పూర్తి స్థాయిలో మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించడం కష్టమని సెలక్టర్లు భావిస్తున్నారు. ఈ రెండు టెస్టుల సిరీస్ కోసం భారత జట్టును జూలై 28న నాటికి ఖరారు చేయనున్నారు.

గాయాల సమస్య.. ఆందోళనలో టీమిండియా మేనేజ్‌మెంట్

గత కొద్ది నెలలుగా నితీశ్ కుమార్ రెడ్డి వేగంగా ఎదుగుతూ, బౌలింగ్ వేగాన్ని పెంచుకున్నాడు. హార్దిక్ పాండ్యాకు సరైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న తరుణంలో, ఈ హైదరాబాద్‌ ఆటగాడు వరుస గాయాల బారిన పడటం టీమిండియా మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఏకకాలంలో బ్యాటింగ్, పేస్ బౌలింగ్ చేయగల ఆల్ రౌండర్ లోటు భారత్‌కు స్పష్టంగా కనిపిస్తోంది. వన్డేల్లో శివమ్ దూబే ప్రభావం చూపలేకపోతుండగా, సూర్యాంశ్ షెడ్గే ఇంకా వయసులో చాలా చిన్నవాడిగా ఉన్నాడు.

అయితే, శ్రీలంక పిచ్‌లపై స్పిన్నర్ల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, నితీశ్ రెడ్డికి పూర్తి విశ్రాంతి ఇవ్వడానికి బీసీసీఐ సిద్ధంగా ఉంది. భారత్ వద్ద ఇప్పటికే మానవ్ సుతార్, హర్ష్ దూబే వంటి ప్రతిభావంతులైన స్పిన్ ఆల్ రౌండర్లు అందుబాటులో ఉన్నారు.

వాషింగ్టన్ సుందర్‌కు గాయం.. కొత్త ఆఫ్ స్పిన్నర్‌కు ఛాన్స్?

మరోవైపు, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ మోకాలి గాయంతో CoEలోనే రీహాబ్‌లో ఉన్నాడు. ఒకవేళ సుందర్ కూడా ఈ సిరీస్‌కు దూరమైతే, జట్టుకు మరొక ఆఫ్ స్పిన్నర్ అవసరం పడనుంది.

జస్‌ప్రీత్ బుమ్రా రీఎంట్రీ? వర్చువల్‌గా సెలక్షన్ కమిటీ భేటీ

ఆగస్టు 15 నుంచి 27 వరకు గాల్ మరియు కొలంబో వేదికలుగా శ్రీలంకతో జరగనున్న ఈ టెస్టుల కోసం జట్టు ఎంపికను వర్చువల్ సమావేశం ద్వారా నిర్వహించనున్నారు.

ఫాస్ట్ బౌలింగ్ విభాగం: స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాను ఈ సిరీస్‌కు ఎంపిక చేయాలా వద్దా అనే దానిపై చర్చించనున్నారు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పేస్ దళాన్ని నడిపిన మహమ్మద్ సిరాజ్ తన స్థానాన్ని నిలబెట్టుకోనున్నాడు.

కొత్త ముఖం: గత రంజీ ట్రోఫీ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అకిబ్ నబీకి మొదటిసారి టెస్టు పిలుపునిచ్చే అంశాన్ని కూడా సెలక్టర్లు పరిశీలిస్తున్నారు.

Click here to add News18 as your preferred news source on Google.

లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports