Japan Tsunami: జపాన్‌లో అతి భారీ భూకంపం.. సునామీ ముప్పు పొంచి ఉందని వార్నింగ్ | | ACTPnews

News18


Last Updated:

Japan Earthquake: జపాన్‌లోని దక్షిణ క్యూషు ద్వీపంలోని కుమామోటో ప్రిఫెక్చర్‌లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం
ఏర్పిడిన ఈ భూపంక తీవ్రత 7.1 రికార్టు స్కేలుపై నమోదైంది. దీంతో అక్కడి వాతావరణశాఖ అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు.

News18
News18

Japan Earthquake: జపాన్‌లోని దక్షిణ క్యూషు ద్వీపంలోని కుమామోటో ప్రిఫెక్చర్‌లో భారీ భూకంపం సంభవించింది. మంగళవారం ఏర్పిడిన ఈ భూపంక తీవ్రత 7.1 రికార్టు స్కేలుపై నమోదైంది. దీంతో అక్కడి వాతావరణశాఖ అధికారులు సునామీ హెచ్చరిక జారీ చేశారు. ఆ ప్రాంతంలోని పలు ప్రిఫెక్చర్‌లలో అత్యవసర హెచ్చరికలు జారీ అయ్యాయి. జపాన్ వాతావరణ సంస్థ (JMA) ప్రకారం ఈ భూకంపం స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4.27 గంటలకు సంభవించింది.

భూకంప కేంద్రం ఉకికి ఆగ్నేయంగా సుమారు 4 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉండటంతో భూమి తీవ్రంగా కంపించింది. సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడిన కొన్ని వీడియోలు, భూకంపం సంభవించినప్పుడు దాని ప్రభావాన్ని చూపించాయి. ఇలాంటి మరో వీడియో కూడా జపాన్‌ను భూకంపం తాకినప్పుడు భూమి తీవ్రంగా కంపించడాన్ని చూపించింది. జపాన్ షిండో భూకంప తీవ్రతా కొలమానం ప్రకారం ఈ భూకంపం లెవెల్ 7గా నమోదైందని, ఇది దేశంలోని భూకంప తీవ్రతా వ్యవస్థలో అత్యధిక స్థాయి అని, తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాలలో భూమి అత్యంత తీవ్రంగా కంపించిందని ఆ సంస్థ తెలిపింది.

భూకంపం తరువాత స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఒక మీటరు ఎత్తు వరకు అలలు తీర ప్రాంతాలకు చేరవచ్చని హెచ్చరిస్తూ క్యూషు తీరప్రాంతంలోని కొన్ని భాగాలకు జపాన్ వాతావరణ సంస్థ (JMA) సునామీ హెచ్చరిక జారీ చేసింది. అంత ఎత్తు అలలను ఇప్పటికే గుర్తించి ఉండవచ్చని ప్రభుత్వ ప్రసార సంస్థ NHK నివేదించింది. జపాన్ ప్రభుత్వం ఏకకాలంలో కుమామోటో, నాగసాకి, కగోషిమా, ఫుకుయోకా, సాగా, ఓయిటా , మియాజాకి ప్రిఫెక్చర్‌లకు అత్యవసర భూకంప హెచ్చరికలను జారీ చేసింది. నివాసితులు అప్రమత్తంగా ఉండాలని అవసరమైన చోట తరలింపు సలహాలను పాటించాలని కోరింది.

అయితే జపాన్ లో సంభవించిన ఈ భారీ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. పెద్ద మొత్తంలో ఆస్తినష్టం కూడా జరిగినట్లుగా అక్కడి అధికారవర్గాలు నివేదించలేదు. సునామీ సంభవించే అవకాశం ఉన్న ప్రకంపనలను పర్యవేక్షిస్తూ, అధికారులు పరిస్థితిని అంచనా వేయడం కొనసాగిస్తున్నారు.

పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ వెంబడి ఉన్నందున జపాన్ ప్రపంచంలో అత్యంత భూకంపాలు సంభవించే దేశాలలో ఒకటి. ఈ ప్రాంతంలో అనేక టెక్టోనిక్ ప్లేట్లు కలుస్తాయి. ఈ దేశంలో ఏటా వందలాది భూకంపాలు సంభవిస్తాయి. ప్రపంచంలో నమోదైన మొత్తం భూకంప కార్యకలాపాలలో దాదాపు 18 శాతం ఈ దేశంలోనే నమోదవుతాయి. 2011లో సంభవించిన 9.0 తీవ్రత గల వినాశకరమైన తోహోకు భూకంపం, సునామీ నుండి దేశం పాఠాలు నేర్చుకుంటూనే ఉంది. ఆ విపత్తులో సుమారు 18,500 మంది ప్రాణాలు కోల్పోయారు లేదా గల్లంతయ్యారు . అది ఫుకుషిమా అణు విపత్తుకు దారితీసింది. తాజాగా జూన్‌ నెలలో కూడా జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. దాని తీవ్రత 7.2గా నమోదైంది. దీనివల్ల పరిమిత నష్టం జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో సంభవించిన మరో శక్తివంతమైన ప్రకంపన, మరింత బలమైన భూకంప కార్యకలాపాలు సంభవించే అవకాశం పెరిగిందని అధికారులను హెచ్చరించడానికి దారితీసింది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports